- Home
- Entertainment
- Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా
Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా
చిరంజీవి మెగాస్టార్ గా మాత్రమే కాదు మనసున్న వ్యక్తిగా అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు. చిరంజీవి గురించి శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఎదిగిన తర్వాత తన కష్టాన్ని, మూలాలను మరచిపోలేదు. అందుకే కష్టంలో ఎవరున్నా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ లాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. లెక్కకు మించి ఆర్థిక సహాయాలు చేశారు. గుప్తదానాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేడు ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి గుప్తదానాలు
సినీ కళాకారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే చిరు వెంటనే స్పందిస్తారు. నటుడు శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఎవ్వరికీ తెలియని, మాకు మాత్రమే తెలిసిన గుప్తదానాలు, సహాయాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. అన్ని విషయాలు ఆయన దృష్టివరకు వెళ్లడం కష్టం.
వాళ్లిద్దరూ కష్టాల్లో ఉంటే..
అన్నింటినీ ఆయన పట్టించుకోలేరు. కానీ ఆయన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టారు. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు లాంటి నటులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిరంజీవి మాచేత డబ్బులు ఇచ్చి పంపారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నట్లు చిరంజీవి గారికి సురేఖ గారి ద్వారా తెలిసింది.
నాకు డబ్బులు ఇచ్చి పంపారు
పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు కష్టాల్లో ఉన్నట్లు సురేఖ గారు టీవీలో చూసి చిరంజీవికి చెప్పారు. చిరంజీవి గారు నన్ను వెంటనే ఇంటికి పిలిచి.. శివాజీ రాజా ఇదిగో ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇవ్వు.. ఈ 2 లక్షలు గుండు హనుమంతరావుకు ఇవ్వు అని నాకు డబ్బులు ఇచ్చి వాళ్లకు అందేలా చేశారు.
అందరినీ గమనిస్తూ ఉంటారు
ఒక వేళ దృష్టికి వచ్చినా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ చిరంజీకి గారు అలా చేయరు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కష్టాల్లో ఉన్నా గమనిస్తూనే ఉంటారు. సాయం చేస్తూనే ఉంటారు అని శివాజీ రాజా తెలిపారు.

