MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • లెటర్ రాయండి.. రూ.50,000 గెలుచుకోండి!

లెటర్ రాయండి.. రూ.50,000 గెలుచుకోండి!

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ‘లెటర్ రైటింగ్ కాంపిటేషన్’ నిర్వహించనుంది. భారతీయ తపాలా శాఖ ఈ పోటీని జాతీయ స్థాయిలో నిర్వహించనుంది.  పోటీలో పాల్గొనే వారికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. కాంపిటిషన్ లో పాల్గొనాలంటే అర్హులు ఎవరు, ఎలాంటి లెటర్స్ రాయాలి తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 22 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మీరు మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసి ఎంత కాలం అయ్యిందో గుర్తుందా? మనమందరం మర్చిపోయిన విషయం ఏమిటంటే పోస్టల్ డిపార్ట్ మెంట్ ఇప్పటికీ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోందని. చాలా మందికి పోస్టల్ డిపార్ట్ మెంట్ అంటే గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంకు లాంటి వ్యవస్థ అనే అనుకుంటారు. కాని ఒకప్పుడు ప్రజల మధ్య కమ్యూనికేషన్ కి ఉన్న ఏకైక మీడియం పోస్టాఫీస్. ఇప్పుడంటే సెల్ ఫోన్లు అంతకు మించిన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి కాని సుమారు 2000 సంవత్సరం వరకు కూడా ఉత్తరాల కమ్యూనికేషన్ జరిగింది. ఇండియాలో ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఉత్తరాలు రాసుకొని పోస్ట్ చేస్తుంటారు. 

ప్రజల్లో మళ్లీ లెటర్స్ కమ్యూనికేషన్ పెంచాలన్న సదుద్దేశంతో భారతీయ తపాలా శాఖ లైటర్ రైటింగ్ కాంపిటేషన్ ను నిర్వహిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తర రచన పోటీ-2024 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి వచ్చే డిసెంబర్ 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనడానికి మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి.  'రాయడంలో ఆనందం, డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత' అనే అంశంపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. మీరు ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో ఏదైనా ఒక భాషలో రాయవచ్చు.

35

మీరు ఇన్‌ల్యాండ్ లెటర్‌లో ఉత్తరం రాయాలనుకుంటే 500 పదాలకు మించకుండా రాసి పంపాలి. పేపర్ పై రాసి కవరులో పెట్టి పంపాలను మీరు అనుకుంటే కనీసం 1000 పదాలకు మించకుండా రాసి పంపవచ్చు. రెండు రకాల ఉత్తరాలు స్వయంగా చేతి రాత(hand writing)తో రాసినవి అయి ఉండాలి. ఇది అతి ముఖ్యమైన కండీషన్. పొరపాటున మీరు టైప్ చేసి పంపిస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు.

పోటీలో పాల్గొనడానికి వయోపరిమితి లేనప్పటికీ '1.1.2024 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు అయి ఉండాలి. మీ వయస్సు ధ్రువపత్రాన్ని(age certificate) తప్పనిసరిగా ఉత్తరంతో పాటు జత చేయాలని తపాలా శాఖ ప్రకటనలో పేర్కొంది. పోటీలో పాల్గొనేవారి పేరు, అడ్రస్ ఉత్తరంలో తప్పకుండా పేర్కొనాలి.

45

ఉత్తరాన్ని 'చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తమిళనాడు సర్కిల్, చెన్నై - 600002' అనే చిరునామాకు, 'సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, నెల్లై పోస్టల్ డివిజన్, నెల్లై- 627002' అనే చిరునామా ద్వారా పంపాలి. ఎంపికైన ఉత్తమ ఉత్తరాలకు జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ నగదు బహుమతులు లభిస్తాయి.

55

రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000, తృతీయ బహుమతిగా రూ.5,000 అందజేస్తారు. జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50,000, ద్వితీయ బహుమతిగా రూ.25,000, తృతీయ బహుమతిగా రూ.10,000 బహుమతిగా అందజేస్తారు. ఉత్తర రచన పోటీలో ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని తపాలా శాఖ కోరుతోంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved