Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి
Gold Price Crash: బంగారం ధరలు ఇవాళ కీలక మలుపు తీసుకున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి...ఈరోజు శాంతించింది. ప్రతి రోజు బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
బంగారం కొనాలనుకునేవారికి, పెట్టుబడి పెట్టాలనుకునేవారికి, అలాగే పెళ్లిళ్లు లేదా శుభకార్యాల కోసం పసిడి కొనుగోలు చేయాలని గుడ్ న్యూస్. బంగారం ధరలు ఇవాళ కీలక మలుపు తీసుకున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి...ఈరోజు శాంతించింది. ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే... హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1850 తగ్గి రూ.1,44,330కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.1700 పతనమై రూ.1,32,300 చేరుకుంది. అటు కేజీ వెండి ధర రూ.2,40,000గా కొనసాగుతోంది.
ప్రతి రోజు బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?
బంగారం ధరలు కేవలం హైదరాబాద్ మార్కెట్ను బట్టి నిర్ణయించబడవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం ధర పెరిగితే మన దేశంలో కూడా ధరలు పెరుగుతాయి. అలాగే అంతర్జాతీయంగా ధరలు తగ్గితే దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచంలోని ప్రధాన సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా బంగారం ధరలపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
బంగారంపై ప్రభావం చూపిస్తున్న డాలర్
ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేసినా కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. డాలర్ బలపడితే చాలాసార్లు బంగారం ధరలు ఒత్తిడికి గురవుతాయి. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
మరో ముఖ్యమైన అంశం
ఇక భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు ఎగబాకుతాయి.
భారత్లో మరో ముఖ్యమైన అంశం... పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్. ఈ సమయంలో నగల కొనుగోళ్లు భారీగా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా శ్రావణం, దసరా, దీపావళి, వివాహాల సీజన్లలో మార్కెట్లో కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.

