MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !

EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !

EPFO Vishwas 2026: ఈపీఎఫ్‌ఓ పాత వివాదాలు, జరిమానాల పరిష్కారానికి 'విశ్వాస్ 2026' స్కీమ్ ప్రారంభించింది. డిజిటల్ పద్ధతిలో 6 నెలల పాటు ఈ వన్ టైమ్ సెటిల్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ విశ్వాస్ పూర్తి వవరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈపీఎఫ్‌ఓ 'విశ్వాస్ 2026' అంటే ఏమిటి?
Image Credit : Gemini

ఈపీఎఫ్‌ఓ 'విశ్వాస్ 2026' అంటే ఏమిటి?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను, జరిమానా కేసులను పరిష్కరించడానికి 'విశ్వాస్ 2026' (VISHWAS 2026) అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక స్వచ్ఛంద వివాద పరిష్కార కార్యక్రమం. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పీఎఫ్ చట్టాల ఉల్లంఘన వల్ల వచ్చే జరిమానాలు, నష్టపరిహారం కేసులను కోర్టుల దాకా తీసుకెళ్లకుండా, సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇది పూర్తిగా పారదర్శకంగా, డిజిటల్ రూపంలో సాగే ఒక వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్.

ఈ పథకం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?

కేంద్ర శ్రమ, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 'విశ్వాస్ 2026' పథకం 2026 జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైన తేదీ నుంచి సరిగ్గా 6 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యజమానులు తమ పాత వివాదాలను, కోర్టు కేసులను ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడానికి ఈ 6 నెలల వ్యవధిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏయే కేసులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది?
Image Credit : Gemini AI

ఏయే కేసులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది?

'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952' లోని సెక్షన్ 14B, 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' లోని సెక్షన్ 128 కింద నమోదైన కేసులకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా నాలుగు రకాల కేసులలో ఈ వెసులుబాటు ఉంటుంది..

• కోర్టు కేసులు: జరిమానా లేదా పరిహారం ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులు లేదా ఇతర న్యాయ స్థలాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు.

• పెండింగ్ రికవరీ కేసులు: చివరి నోటీసులు జారీ అయి, ఇంకా సొమ్ము పూర్తిగా వసూలు కాకుండా రికవరీ సర్టిఫికేట్ జారీ అయిన కేసులు.

• నోటీసులు ఇచ్చిన కేసులు: ఈపీఎఫ్‌ఓ నుంచి నోటీసులు అంది, ఇంకా చివరి జరిమానా ఆదేశాలు రాక పెండింగ్‌లో ఉన్న కేసులు.

• ప్రారంభ దశలోని కేసులు: జరిమానాల సంబంధించి ఇంకా నోటీసులు కూడా జారీ కాకుండా ప్రాథమిక దశలో ఉన్న వ్యవహారాలు.

Related Articles

Related image1
Housing Scheme: రూ.6 లక్షలకే హైదరాబాద్‌లో సొంత ఇల్లు.. దరఖాస్తు విధానం, అర్హతలు సహా పూర్తి వివరాలు ఇవే
Related image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
34
జరిమానాలు తగ్గుతాయి.. అప్లై చేయడం ఎలా?
Image Credit : Asianet News

జరిమానాలు తగ్గుతాయి.. అప్లై చేయడం ఎలా?

ఈ స్కీమ్ కింద 2024 జూన్ 14 కంటే ముందు జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి విధించే జరిమానాలను చాలా వరకు తగ్గించారు. తగ్గించిన రేట్ల వివరాలు ఇవే..

• 2 నెలల వరకు ఆలస్యమైతే: నెలకు 0.25 శాతం జరిమానా.

• 2 నుంచి 4 నెలల వరకు ఆలస్యమైతే: నెలకు 0.50 శాతం జరిమానా.

• 4 నెలల కంటే ఎక్కువ ఆలస్యమైతే: నెలకు 1.00 శాతం జరిమానా విధిస్తారు.

యాజమాన్యాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందడానికి ఈపీఎఫ్‌ఓ ఎంప్లాయర్ పోర్టల్ (EPFO Employer Portal) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఇ-సైన్ తప్పనిసరి. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని జోనల్, రీజినల్, డిస్ట్రిక్ట్ ఆఫీసులలో ప్రత్యేకంగా విశ్వాస్ సెల్స్ ఏర్పాటు చేశారు.

44
పీఎఫ్ హోల్డర్లు, ఎంప్లాయర్లకు కలిగే ప్రయోజనం ఏంటి?
Image Credit : Asianet News

పీఎఫ్ హోల్డర్లు, ఎంప్లాయర్లకు కలిగే ప్రయోజనం ఏంటి?

ప్రాథమికంగా ఇది కంపెనీ యాజమాన్యాలు, ఈపీఎఫ్‌ఓ మధ్య ఉన్న వివాదాలను క్లియర్ చేసే స్కీమ్ అయినప్పటికీ, దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు చాలా మేలు జరుగుతుంది. పెండింగ్ కేసులు క్లియర్ అవ్వడం వల్ల, చాలా కాలంగా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఉద్యోగుల పీఎఫ్ క్లైమ్‌లు, నిధుల విడుదల వేగంగా పూర్తవుతాయి. కోర్టు వివాదాల వల్ల వేల రూపాయల డబ్బులు, సమయం వృథా కాకుండా కంపెనీలకు ఆదా అవుతుంది. మరోవైపు ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ లభిస్తుంది. పీఎఫ్ వ్యవస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో యుద్ధ భయాలు..మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు
Recommended image2
IRCTC: భక్తులకు 9 రోజుల ఆధ్యాత్మిక టూర్... ఒక్క ప్యాకేజీలో 4 పవిత్ర క్షేత్రాల యాత్ర, IRCTC అదిరే ప్యాకేజీ
Recommended image3
Gold Price Hike: పసిడి మళ్లీ అందని ద్రాక్షే! బంగారం.. వెండి రెండూ పెరిగాయి!
Related Stories
Recommended image1
Housing Scheme: రూ.6 లక్షలకే హైదరాబాద్‌లో సొంత ఇల్లు.. దరఖాస్తు విధానం, అర్హతలు సహా పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved