MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Airtel వినియోగదారులకు బంపర్ ఆఫర్: 6 నెలల పాటు రీఛార్జ్ చేయక్కరలేదు

Airtel వినియోగదారులకు బంపర్ ఆఫర్: 6 నెలల పాటు రీఛార్జ్ చేయక్కరలేదు

BSNL దెబ్బకు Airtel, Jio, vodafone-Idea లాంటి టెలికాం కంపెనీలన్నీ దిగి వస్తున్నాయి. ఇటీవలే రేట్లు పెంచిన Airtel, Jio ఇప్పుడు తగ్గింపు టారిఫ్ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్‌టెల్ తన వినియోగదారులను కాపాడుకోవడానికి సూపర్ ఆఫర్ ప్లాన్‌ను ప్రకటించింది.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 12 2024, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఇటీవల తమ రేట్లను పెంచాయి. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు పోర్టబులిటీ ఆప్షన్ ను ఉపయోగించుకొని BSNL నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. ఇప్పటికే  కొన్ని లక్షల మంది తమ నెట్ వర్క్ లోకి వచ్చి చేరారని BSNL ప్రకటించింది. దీంతో ఉన్న ఖాతాదారులనైనా కాపాడుకోవాలని ఎయిర్‌టెల్, జియో కంపెనీలు వివిధ ఆఫర్లు, సరసమైన ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Airtel కొన్ని కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

Airtel రూ.155 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.155 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 28 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 100 SMS సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది అపరిమిత డేటాను కూడా ప్రొవైడ్ చేస్తుంది. 

35

Airtel లాంగ్ టర్మ్ ప్లాన్
ఎయిర్‌టెల్ కూడా ఎక్కువ కాలం చెల్లుబాటుతో కూడిన రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ మీరు తీసుకుంటే 6 నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్‌లో మీరు అపరిమిత కాల్స్, SMS డేటా సౌకర్యం, అపరిమిత డేటాబ్యాక్‌లను కూడా పొందవచ్చు. మరింత సమాచారం కోసం మీరు Airtel థాంక్స్ యాప్‌ని సందర్శించవచ్చు.

45

ఎయిర్‌టెల్‌కి పోటీగా జియో
ఎయిర్‌టెల్ తర్వాత జియో కూడా అనేక తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ప్రైమ్ వినియోగదారుల కోసం జియో ఫోన్ ప్రత్యేక ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

Jio వినియోగదారులు ఇప్పుడు రూ.223 రీఛార్జ్ చేయడం ద్వారా రోజుకు 2 GB డేటా రేటుతో 28 రోజుల పాటు ఉచిత అపరిమిత కాల్‌లు, మొత్తం 56 GB డేటాను పొందవచ్చు. రూ.250 రీఛార్జ్‌తో 30 రోజుల పాటు అపరిమిత కాల్‌లు, అపరిమిత డేటాను పొందవచ్చు. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లు కూడా రోజుకు 100 SMSలను పంపే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.

ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు జియో సినిమాకి కూడా యాక్సెస్ ఇస్తున్నారు. ఇది OTT స్ట్రీమింగ్ ఫీజులను ఆదా చేస్తుంది. మీరు Jio TV, Jio క్లౌడ్‌కి ఉచిత సభ్యత్వంతో టీవీ ప్రోగ్రామ్స్, మూవీస్ చూడవచ్చు. రూ.223 ప్లాన్ జియో ఫోన్ ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కాదు.
 

55

జియో ఇతర ప్రాజెక్టులు!

1. రూ.149 స్టార్టర్ ప్లాన్‌
ఈ ప్లాన్ స్వల్ప వ్యవధి, డేటా కోసం ప్రాథమిక అవసరాలను కవర్ చేస్తుంది. రోజుకు గరిష్టంగా 1.5 GB లేదా 2 GB డేటా లభిస్తుంది.

2. రూ.399 నుండి రూ.599 మీడియం డేటా ప్లాన్‌లు
రోజుకు 1.5 GB లేదా 2 GB డేటా లభిస్తుంది. ఉచిత కాల్స్, రోజుకు 100 SMS పంపవచ్చు.

3. రూ.999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌ ద్వారా రోజుకు 3 GB లేదా అంతకంటే ఎక్కువ డేటా వినియోగించుకోవచ్చు. మరింత ఇంటర్నెట్ వినియోగం కోసం ఉత్తమ ప్రణాళికలు చెక్ చేయండి. 

4. రూ.2,879 లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ప్లాన్‌లు వేసుకుంటే రోజుకు 2 GB లేదా 3 GB వరకు డేటా వినియోగించుకోవచ్చు. 365 రోజుల సేవలతో దీర్ఘకాలిక వినియోగదారులకు మంచి ఎంపిక అవుతుంది. 

5. రూ.2399 ప్లాన్ అన్ లిమిటెడ్ ప్లాన్ తో రోజుకు 2 GB కంటే ఎక్కువ ఇంటర్నెట్ కనెక్షన్ పొందవచ్చు. 
అపరిమిత ఉచిత కాల్స్, గరిష్ట ప్రయోజనాలు అందుతాయి. 

ఏది ఏమైనా ప్రస్తుతానికి Airtel, Jio పోటీ పడి తమ వినియోగదారులకు కాపాడుకోవడానికి ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులు డాటా ప్లాన్ లు పరిశీలించి రీఛార్జ్ చేసుకోగలరు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved