MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: అరెస్టైంది వీరే, కేసు కొలిక్కి వచ్చేనా?

వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: అరెస్టైంది వీరే, కేసు కొలిక్కి వచ్చేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ఇప్పటికే  పలువురిని  సీబీఐ అరెస్ట్  చేసింది.  రానున్న రోజుల్లో  మరిన్ని అరెస్టులు  జరిగే  అవకాశం లేకపోలేదు. 

3 Min read
Author : narsimha lode
Published : Apr 16 2023, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ  దూకుడును  పెంచింది  ఈ కేసు విచారణ ఆలస్యం కావడంపై  సుప్రీంకోర్టు  ఇటీవలనే  ఆగ్రహం వ్యక్తం  చేసింది.  దీంతో  కేసు  విచారణను పూర్తి  చేయాలని  సీబీఐ భావిస్తుంది. ఈ కేసులో  కీలక సూత్రధారులను  సీబీఐ  అరెస్ట్  చేసే అవకాశం ఉందనే  ప్రచారం  సాగుతుంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

రెండు  రోజుల వ్యవధిలో  పులివెందులకు  చెందిన  ఇద్దరిని  సీబీఐ అధికారులు  అరెస్టు  చేశారు. ఆదివారంనాడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ  అధికారులు  అరెస్ట్  చేయడం  ప్రాధాన్యత  సంతరించుకుంది.

311
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణ  ఆలస్యం కావడంపై  ఈ ఏడాది  మార్చి 20న  సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది. అవసరమైతే విచారణ అధికారిని  మార్చాలని కూడా  ఉన్నత న్యాయస్థానం  సూచించింది.  

411
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

2019  మార్చి  14వ తేదీ  రాత్రి పులివెందులలోని  తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డిని  దుండగులు  హత్య  చేశారు. ఈ హత్య  జరిగిన సమయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్నారు. ఈ హత్య  కేసు విచారణకు  సిట్ ను  ఏర్పాటు  చేసింది  చంద్రబాబు సర్కార్ . 2019  ఎన్నికల్లో  చంద్రబాబు  ఓటమి పాలయ్యాడు.  వైఎస్ జగన్  సీఎంగా  బాధ్యతలు  చేపట్టారు.  అయితే  ఈ కేసు విచారణకు  చంద్రబాబు  సర్కార్  నియమించిన  సిట్ స్థానంలో  మరో సి్ట్ ను  ఏర్పాటు  చేశారు.  

511
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసును  సీబీఐతో విచారించాలని  మాజీ మంత్రి  ఆదినారాయణరెడ్డి,  టీడీపీ ఎమ్మెల్సీ  బిటెక్ రవి,  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు   వైఎస్  సునీతారెడ్డి  ఏపీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై విచారించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ  విచారణకు ఆదేశాలు  జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి సిట్ ను వివరాలను  సేకరించింది సీబీఐ.  ఈ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు  విచారిస్తుంది. 

611
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ కేసును సీబీఐ విచారణ  చేపట్టిన తర్వాత  పలువురిని అరెస్ట్  చేసింది.   2021  ఆగష్టు మాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడుు ఎర్ర గంగిరెడ్డిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో   ఉపయోగించిన  ఆయుధాల  కోసం  సీబీఐ అధికారులు  గాలింపు  చర్యలు చేపట్టారు.

711
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

2021  ఆగస్టు 2న  ఏ2 సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2021  సెప్టెంబర్  8న ఏ3 ఉమాశంకర్ రెడ్డిని  సీబీఐ అధికారులు   అరెస్ట్  చేశారు.  2021  నవంబర్  17న  ఏ5 దేవిరెడ్డి  శివశంకర్ రెడ్డి అరెస్ట్ చేసింది సీబీఐ. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  గతంలో  ఆయన  వద్ద పనిచేసిన దస్తగిరి ని  సీబీఐ అదుపులోకి తీసుకుని  ప్రశ్నించారు. అయితే  ఈ కేసులో  దస్తగిరి  సీబీఐకి  అఫ్రూవర్ గా మారాడు.  2021  ఆగష్టు  30వ తేదీన దస్తగిరి ఇచ్చిన  స్టేట్ మెంట్ ను  సీబీఐ అధికారులు  ప్రొద్దుటూరు  కోర్టులో  సమర్పించారు. ఎర్ర గంగిరెడ్డి,  సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో  కలిసి  వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగా   దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్  ఇచ్చారు. 

811
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ కేసు విచారణ  నత్తనడకన  సాగడంపై  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  వైఎస్ సునీతా రెడ్డి  సీబీఐ  అధికారులకు  ఫిర్యాదు  చేశారు.  దీంతో   కేసు దర్యాప్తులో  సీబీఐ అధికారులు  వేగం  పెంచారు. 

911
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

ఈ నెల  14న  కడప ఎంపీ  వైఎస్  అవినాష్ రెడ్డికి  సన్నిహితుడు  గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్  చేసింది.  ఇవాళ  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్  చేసింది. 

1011
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  కూడా ఈ కేసులో  సీబీఐ అధికారులు విచారించారు.  ఈ కేసులో  తనను అరెస్ట్  చేయవద్దని ఆదేశాలు  ఇవ్వాలని కడప ఎంపీ  అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.  సీబీఐ విచారణ  చేసుకోవచ్చని  కూడా  ఆదేశించింది. 

1111
వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి

వైఎస్  వివేకానందరెడ్డి  హత్య  కేసు  విచారణను త్వరగా  పూర్తి చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  దర్యాప్తులో  వేగం పెంచింది సీబీఐ. అయితే  ఈ కేసు  ఎన్ని  రోజుల్లో  కొలిక్కి వస్తుందో అనే విషయమై  ఇంకా స్పష్టత లేదు. 
 

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Now Playing
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
Recommended image3
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved