MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • మహిళా పక్షపాత ప్రభుత్వం: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల చేసిన జగన్

మహిళా పక్షపాత ప్రభుత్వం: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల చేసిన జగన్

ఉమ్మడి  ప్రకాశం జిల్లాలోని  మార్కాపురంలో  వైఎస్ఆర్ ఈబీసీ   పథకం కింద  నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  విడుదల  చేశారు.

2 Min read
Author : narsimha lode
Published : Apr 12 2023, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ys jagan

ys jagan

లంచాలు వివక్ష లేని పరిపాలనతో కేవలం నాలుగేళ్లలో చరిత్ర సృష్టించినట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.బుధవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రకాశం  జిల్లా  మార్కాపురంలో  వైఎస్ఆర్ ఈబీసీ  పథకం  కింద  నిధులను  విడుదల  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. కుల, మత, ప్రాంత రాజకీయ పార్టీలనే బేధం లేకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించినట్టుగా  ఆయన  చెప్పారు. పేదవారి ఆర్థిక స్వావలంభనకు పటిష్ట చర్యలు తీసుకున్నామని సీఎం జగన్  తెలిపారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ys jagan

ys jagan


 ఓసీ కులాల్లోని పేద  మహిళల కోసం ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నామన్నారు. 4.39 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు రూ.658 కోట్లు ఇవాళ  నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు  సీఎం ప్రకటించారు.   వైఎస్ఆర్  ఈబీసీ నేస్తం కింద ఇప్పటివరకూ రూ. 1257 కోట్లు ఇచ్చామన్నారు. దాదాపు 4 లక్షలమంది లబ్ధిదారులు రెండో దఫా ఈ నిధులు అందుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని సీఎం పేర్కొన్నారు. 

మహిళలు  ఆర్థికంగా నిలబడాలని, సామాజికంగా, రాజకీయపరంగా, సాధికారత సాధించాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అమ్మ ఒడి దగ్గర నుంచి 30 లక్షల ఇళ్లపట్టాల వరకూ  చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం పేర్కొన్నారు. 

37
ys jagan

ys jagan

ఈబీసీ నేస్తం, కాపు నేస్తం  పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. . ఎన్నికల్లో హామీలుగా కూడా ఇవ్వలేదని అయినా కూడా అగ్రకులాల్లోని పేదలకు మంచి జరగాలని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కేవలం 46 నెలల కాలంలోనే ఇప్పటికే రూ. 2.07లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని  సీఎం గుర్తు  చేశారు.  ఇందులో 1.42 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో వేసినట్లు  సీఎం  వివరించారు. మన ప్రభుత్వం . రాష్ట్రంలోని కోటి యాభై లక్షలమంది కుటుంబాలకు చేస్తున్న మంచిని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని  సీఎం  కోరారు.  

47
ys jagan

ys jagan


గత ప్రభుత్వంలో 2014-19 మధ్య పేదవాడికి చేసిన మంచిపై పేదవాడి ఇంటి వద్ద నిల్చొని సెల్ఫీ ఛాలెంజ్ చేయాలని చంద్రబాబుకు సీఎం జగన్ సూచించారు.  చంద్రబాబు పాలనలో  పేదలకు  ఒక్క రూపాయి కూడా  ప్రయోజనం దక్కలేదని  ఆయన విమర్శించారు.  

57
ys jagan

ys jagan

సంక్షేమ పథకాల కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డీబీటీ అమలు చేస్తుంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం దొచుకో.. పంచుకో.. తినుకో పద్దతి అమలు చేసిందని ఆయన  ఆరోపించారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఆసరా , చేయూత వంటి పథకాల కింద పేదలకు లబ్ది చేకూర్చామన్నారు.
 

67
ys jagan

ys jagan

 సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదన్నారు. పేదవాడికి చేసే మంచే తనకు సెల్ఫీ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ  అని చెప్పగలవా అని బాబును సీఎం జగన్ ప్రశ్నించారు.
 

77
ys jagan

ys jagan


చంద్రబాబు నిజాలు దాచి అబద్దాలు అసత్య ప్రచారాలతో తన ఎల్లో మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ అబద్ధాల బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. గత ఐదేళ్ల హయాంలో ఒక్క ఇళ్లస్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారని  ప్రశ్నించాలని  కోరారు.  వైఎస్సార్ సీపీ హయాంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఎలా సాధ్యపడిందని ఎల్లో బ్యాచ్ ను నిలదీయాలని కోరారు.

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved