నితిన్కి ఆ హీరోయిన్ కూడా హ్యాండిచ్చిందా!
తెలుగు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఆ పాత్ర కోసం ముందు నయనతారను ట్రై చేశారు చిత్రయూనిట్, కానీ నయన్ సపోర్టింగ్ రోల్స్ కోసం 9 కోట్లు డిమాండ్ చేయటంతో నిర్మాతలు షాక్ అయ్యారు.
వరుస ఫ్లాప్ల తరువాత టాలీవుడ్ హీరో నితిన్ ఈ మధ్యే భీష్మతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు నితిన్. ఇప్పటికే రంగ్ దే సినిమాను పూర్తి చేసిన నితిన్ ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్లో ఆయుష్మాన్ ఖుర్రానా, టబులు కీలక పాత్రల్లో నటించారు.
తెలుగు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఆ పాత్ర కోసం ముందు నయనతారను ట్రై చేశారు చిత్రయూనిట్, కానీ నయన్ సపోర్టింగ్ రోల్స్ కోసం 9 కోట్లు డిమాండ్ చేయటంతో నిర్మాతలు షాక్ అయ్యారు. తరువాత బాలీవుడ్లో చేసిన టబును తీసుకోవాలని భావించారు. అయితే టబు మాత్రం చేసిన పాత్రను మళ్లీ చేయనని ఖరాకండిగా చెప్పేసిందట.
ఆ తరువాత ఆ స్థానంలో అనసూయ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్గా చిత్రయూనిట్ శ్రియ కు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మేర్లపాక గాంధీ శ్రియకు కథ కూడా వినిపించాడట. అయితే శ్రియ మాత్రం ఇంకా ఈ సినిమాకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు గమనంలో నటిస్తున్న ఈ బ్యూటీ అంధాదున్ రీమేక్ కు ఓకే చెపుతుందేమో చూడాలి.