రహస్య పెళ్లిపై మరోసారి స్పందించిన ప్రణీత సుభాష్..
రహస్య పెళ్లిపై మరోసారి స్పందించి ప్రణీత సుభాష్. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, `కరోనా ప్రభావం, ఆషాడం కారణంగా మా పెళ్లి చాలా నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింద`ని తెలిపింది.
ప్రణీత సుభాష్ మే 31న బెంగుళూరులో రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బెంగుళూరుకి చెందిన బిజినెస్మేన్, తన చిన్ననాటి స్నేహితుడు నితిన్రాజుని ఆమె పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఫోటో బయటకు రావడంతో వీరి మ్యారేజ్ చర్చనీయాంశంగా మారింది. చెప్పకుండా పెళ్లి చేసుకోవడంపై సర్వత్రా రకరకాల చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రణీత స్పందించి అనుకోకుండా డేట్ సెట్ అయ్యిందని, టైమ్ లేదని, చాలా నిరాడంబరంగా మ్యారేజ్ చేసుకున్నట్టు వివరణ ఇచ్చింది.
తాజాగా మరోసారి స్పందించి ప్రణీత సుభాష్. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, `కరోనా ప్రభావం, ఆషాడం కారణంగా మా పెళ్లి చాలా నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింది. కానీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు, అందరి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మా పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నాం. కానీ ఈ సారి జులైలోనే ఆషాడం ఉంది. ఆషాడ మాసం దగ్గర్లోనే ఉండేసరికి సింపుల్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా కుటుంబం అన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. అందుకే ఆషాడ మాసం, దాని తర్వాత వచ్చే పరిణామాలపై అపనమ్మకంతో ఇరు కటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుకను నిర్వహించాం.
అంతేగాక సెకండ్ వేవ్ ఉధృతికి ఎంతోమంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చూస్తున్న క్రమంలో మేము ఆడంబరంగా వివాహం చేసుకోవడం సరైనది కాదనే భావన కూడా ఒక కారణం` అని తెలిపింది. ప్రణీత హిందీలో నటించిన `భుజ్` చిత్రం ఓటీటీలో విడుదల కాగా, మరో సినిమా `హంగామా-2` విడుదలకు రెడీగా ఉంది. కన్నడలో `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది. ఇక తెలుగులో చివరగా `ఎన్టీఆర్ః కథానాయకుడు`లో కృష్ణ కుమారి పాత్రని పోషించింది.