షూటింగ్లో గాయం.. రక్తం కారుతున్న లెక్క చేయకుండా నోరా ఫతేహి సాహసం
అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్, నోరా ఫతేహి, ప్రణీత శుభాష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `భుజ్ః ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`. ఈ సినిమా షూటింగ్లో గాయపడిందట నోరా ఫతేహి.
బాలీవుడ్ నటి నోరా ఫతేహి రక్తం చిందించింది. నుదుటిపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంది. సన్నివేశాలను మరింత రక్తికట్టించి ఇప్పుడు హైలైట్గా నిలుస్తుంది. మరి నోరా ఫతేహి ఎందుకు రక్తం చిందించింది, గాయానికి కారణాలేంటి? అనేది చూస్తే.. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్, నోరా ఫతేహి, ప్రణీత శుభాష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `భుజ్ః ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`. అభిషేక్ డుదియా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆగస్ట్ 13 డిస్నీ హాట్స్టార్లో విడుదల కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నోరా ఫతేహి మాట్లాడుతూ, తాను ఈ సినిమా షూటింగ్ టైమ్లో గాయపడిందట. అయినా సన్నివేశాలను పండించడం కోసం తన బాధని భరిస్తూ షూటింగ్లో పాల్గొందట. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగలడంతో రక్తం కారింది. దాన్ని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొనడంతో ఆ సీన్ చాలా సహజంగా వచ్చిందని తెలిపింది.
`భుజ్ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నా నుదుటి మీద గన్ పెట్టగా అతడిని నేను ఎదురించాలి. రిహార్సల్స్ బాగానే చేశాం. కానీ తీరా దీన్ని షూట్ చేసేటప్పుడు ఆ మెటల్ గన్ నా ముఖానికి చాలా బలంగా తగలడంతో ఒక్కసారిగా రక్తం చిందింది. ఆ తర్వాతి రోజు మరో యాక్షన్ సీన్లోనూ కాలికి గాయమైంది. ఈ దెబ్బల తాలూకు మచ్చలతోనే అన్ని సీన్లలో నటించాను. డూప్ లేకుండా గాయాలతోనే యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేయడం నా జీవితంలో మర్చిపోలేను` అని తెలిపింది నోరా. ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది.