Asianet News TeluguAsianet News Telugu

రూ.20 కోట్లు కూడా వసూలు చేయని స్టార్ హీరో చిత్రం.. బాలీవుడ్ విలవిల

బాలీవుడ్ క్రేజీ హీరో అక్షయ్ కుమార్ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో. అక్షయ్ కుమార్ చిత్రాలకు ఎలాంటి హంగులు అవసరం లేదు. మంచి కంటెంట్ తో సినిమా రిలీజ్ చేస్తే చాలు. అలవోకగా 100 కోట్ల వసూళ్లు దాటేస్తాయి. 

dull bollywood box office fearing producers
Author
Hyderabad, First Published Aug 29, 2021, 8:28 PM IST

బాలీవుడ్ క్రేజీ హీరో అక్షయ్ కుమార్ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో. అక్షయ్ కుమార్ చిత్రాలకు ఎలాంటి హంగులు అవసరం లేదు. మంచి కంటెంట్ తో సినిమా రిలీజ్ చేస్తే చాలు. అలవోకగా 100 కోట్ల వసూళ్లు దాటేస్తాయి. 

కానీ ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని చోట్ల థియేటర్స్ తెరుచుకోలేదు. థియేటర్లు ఓపెన్ చేసిన ప్రాంతాల్లో ప్రేక్షకులు సినిమా చూసేందుకు రావడం లేదు. రీసెంట్ గా విడుదలైన అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' చిత్రానికి వసూళ్లు కరువయ్యాయి. 

సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కలెక్షన్స్ 20 కోట్లు కూడా దాటలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా భయం ప్రజల్లో ఇంకా ఉంది. అందుకే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు ఓటిటి ప్రభావం కూడా ఉంది. 

థియేటర్స్ లో రిలీజైన సినిమా కూడా కొద్దిరోజుల గ్యాప్ లోనే ఓటిటిలోకి వచ్చేస్తోంది. దీనితో ఓటిటిలో తీరిగ్గా చూసుకోవచ్చులే అని ఆలోచించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి చూసి నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. 

త్వరలో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లేడి కంగనా రనౌత్ నటించిన తలైవి చిత్రం రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో అయినా బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మెరుగవుతుందేమో అని నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios