Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పట్టాలు తప్పిన రైలింజిన్

మహబూబ్‌నగర్ జిల్లాలో రైలింజిన్ పట్టాలు తప్పింది. మన్యంకొండ సమీపంలో ఓ ట్రాక్ మిషన్ పట్టాలు తప్పడంతో హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లోనే పలు రైళ్లు నిలిచిపోయాయి

rail engine derailed in mahabubnagar
Author
Mahabubnagar, First Published Oct 9, 2019, 8:31 PM IST

మహబూబ్‌నగర్ జిల్లాలో రైలింజిన్ పట్టాలు తప్పింది. మన్యంకొండ సమీపంలో ఓ ట్రాక్ మిషన్ పట్టాలు తప్పడంతో హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లోనే పలు రైళ్లు నిలిచిపోయాయి. రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు సుమారు 4 గంటలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో జనం పెద్ద సంఖ్యలో మహబూబ్‌నగర్ బస్టాండ్‌కు పోటెత్తారు.. అయితే అక్కడ బస్సులు లేకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ట్రాక్‌ మిషన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios