ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆమె అస్త్రసన్యాసం ఎందుకు చేశారా? అనే ఆసక్తి నెలకొంది.
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును నిరాకరించిందని, అందుకే కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మోతీలాల్ నెహ్రూను ప్రస్తావించారు. ఆయన స్వతంత్ర సంగ్రామానికి విరాళం ఇచ్చినట్టుగానే తాను కూడా సినిమాలు చేసి సంపాదించిన రూ. 10 కోట్లు పార్టీకి విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు.
గల్ఫ్ టికెట్ విజేతలు పలువురు భారతీయులు తమ అదృష్టాన్ని తడిమిచూసుకున్నారు. జీవితాలు మలుపుతిప్పుకునేలా బహుమానాలు గెలుచుకున్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కేసుతో తనను కలిపి వస్తున్న ఆరోపణలను ఖండించారు.
బీజేపీని ఇంటికి పంపించే వరకు నిద్రపోబోమని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తుఫాన్ వచ్చినప్పుడూ తమిళనాడుకు రాని ప్రధాని మోడీ.. ఎన్నికలు రాగానే తరుచూ వస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారిద్దరినీ శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. భూ కబ్జాకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.