వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: జగన్పై రాధా-రంగా మిత్రమండలి ఫైర్
వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా ప్రభావం కృష్ణాజిల్లాలో సంచలనం కలిగించింది. రాధ బాటలో నడిచిన పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై రాధా-రంగా మిత్రమండలి ఫైరయ్యింది.
వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా ప్రభావం కృష్ణాజిల్లాలో సంచలనం కలిగించింది. రాధ బాటలో నడిచిన పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై రాధా-రంగా మిత్రమండలి ఫైరయ్యింది.
రాధ విషయంలో జగన్ వ్యవహారించిన తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. రంగా కుటుంబాన్ని మోసం చేశారని ఆరోపించింది. రాధను వదులుకుని జగన్ పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించింది.
వంగవీటి రాధా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటనే ఉంటామని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించడంపై టికెట్ కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో దుమారం రేగింది.
ముఖ్యంగా బెజవాడ సెంట్రల్ టికెట్ విషయం కారణంగానే రాధ పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినప్పటికీ పార్టీని వీడేందుకే రాధ మొగ్గుచూపారు.
వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై
వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు
వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..
రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా
వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ
జగన్కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా
వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?
వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ
వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు
వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ
వంగవీటి రాధాకు మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు
వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...
వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్లోకి టీడీపీ?
వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు
వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా