రెడీ: ఈ నెల 12 నుండి జగన్ యాత్ర, దాడిపై వివరణ
వైసీపీ చీప్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను ఈ నెల 12 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: వైసీపీ చీప్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను ఈ నెల 12 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో గత నెల 25వ తేదీన శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి దిగాడు. దీంతో ప్రజా సంకల్పయాత్రను జగన్ వాయిదా వేశారు.
కత్తి దాడి కారణంగా జగన్ భుజానికి గాయమైంది. ఈ నెల 3వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించాలని తొలుత జగన్ భావించాడు. అయితే గాయం ఇంకా మానకపోవడంతో పాదయాత్రను విరమించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో మూడో తేదీన ప్రారంభించాలనుకొన్న యాత్రను రద్దు చేసుకొన్నారు.
ఈ నెల 12వ తేదీ నుండి జగన్ పాదయాత్రను పున : ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లాకు బయలుదేరేందుకు వీలుగా నవంబర్ 11వ తేదీ సాయంత్రం జగన్ హైద్రాబాద్ నుండి విజయనగరం జిల్లాకు బయలు దేరనున్నారు.12వ తేదీ నుండి యాత్రను ప్రారంభిస్తారు.
తనపై శ్రీనివాసరావు దాడికి సంబంధించి పాదయాత్రలో వివరిస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి జగన్ ఏం చెబుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు
రేపు నిర్ణయిస్తాం: జగన్ మీద దాడిపై హైకోర్టు
జగన్పై దాడి: జోగి రమేష్ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత
జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్
జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులుజగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్పై దాడి: శ్రీనివాస్ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?
జగన్కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్లో వెల్డర్, హైద్రాబాద్లో కుక్
జగన్పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం
జగన్పై దాడి కేసు...శ్రీనివాస్ మళ్లీ జైలుకే
జగన్పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?
జగన్పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ
జగన్పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ
శివాజీని చంపి జగన్పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు