ఈడీ ఆఫీస్ లోనూ చెదరని చిరునవ్వుతో... కవిత విక్టరీ సింబల్

Mar 21, 2023, 1:43 PM IST

న్యూడిల్లీ : డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన కవిత చిరునవ్వుతో కార్యాలయంలోకి వెళ్ళారు. ఈడి ధ్వంసం చేసినట్లుగా ఆరోపిస్తున్న పది సెల్ ఫోన్లను తీసుకుని కార్యాలయంలోకి వెళ్లిన కవిత విక్టరీ సింబల్ చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.