Telugu news live updates: కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

సారాంశం

 జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం తెలిసిన వెంటనే పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఉగ్రదాడికి సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

12:05 AM (IST) Apr 24

కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

కారులో ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణం చేయడం కష్టమే కదా.. కాని కారుల్లో కూడా మసాజ్ చేసే సీట్లు ఉంటే చాలా బాగుంటుంది కదా.. లాంగ్ జర్నీలను హాయిగా మార్చడానికి మసాజ్ సీట్లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల కంపెనీలు, అవి ఇచ్చే ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:59 PM (IST) Apr 23

Nani HIT-3: హీరో ప్రభాస్‌ కోసం కథ సెట్‌ చేస్తున్న హీరో నాని.. పాన్‌ఇండియా హిట్‌ రెడీ!

Nani HIT-3: హీరో నాని హిట్‌-3 ప్రమోషన్స్‌లో బిజి అయ్యారు. వరుసపెటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తను తర్వాత చేయబోయే సినిమాలతోపాటు ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ వివరాలేంటంటే.. 

పూర్తి కథనం చదవండి

11:50 PM (IST) Apr 23

Jasprit Bumrah : టీ20ల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా

SRH vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో  జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 170 వికెట్లు తీసి లసిత్ మలింగ  రికార్డును సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వికెట్లు సాధించాడు.  
 

పూర్తి కథనం చదవండి

11:33 PM (IST) Apr 23

Rohit Sharma: రోహిత్‌ ఖాతాలో మరో రికార్డ్‌.. హిట్‌మ్యాన్‌తో అంత ఈజీ కాదు!

Rohit Sharma: ఇండియన్‌ టీంలో అలవోకగా సిక్సర్లను బాదే రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఎదుటి జట్టులో ఎలాంటి బౌలింగ్‌ లైనప్‌ ఉన్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెమటలు పట్టిస్తుంటాడు. ఇక ఐపీఎల్‌లో ఏవిధంగా పరుగుల వరద పారిస్తాడో అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన ముంబై, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ కొత్త రికార్డు సృష్టించాడు.

పూర్తి కథనం చదవండి

11:33 PM (IST) Apr 23

SRH vs MI: సొంత‌గ‌డ్డ‌పై స‌న్ రైజ‌ర్స్ కు షాకిచ్చిన ముంబై ఇండియ‌న్స్

SRH vs MI, IPL 2025:ఐపీఎల్ 2025లో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ సూపర్ నాక్స్ ఆడారు. హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ లు వృధా అయ్యాయి.  

పూర్తి కథనం చదవండి

11:28 PM (IST) Apr 23

మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

Best Camera Smartphones: ఈ కాలంలో మంచి కెమెరా ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కువ ధర పెడితే కాని మంచి ఫోన్ కొనలేం. కాని ఇటీవల టాప్ కంపెనీలు బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

11:20 PM (IST) Apr 23

EV Sales EV అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో టాప్ గేర్లో.. తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతంటే..

ఏడు రాష్ట్రాల్లోనే అత్యధికం: ఇండియాలో EVల సేల్స్ లో టాప్ 7 స్టేట్స్ 64% వాటా కలిగి ఉన్నాయి. UP అమ్మకాలలో ముందున్నా, మహారాష్ట్ర 2W, PV, CVలలో టాప్ లో ఉంది. తమిళనాడు EVల తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.

పూర్తి కథనం చదవండి

10:51 PM (IST) Apr 23

Weather : తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్... ఈ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు... ఈ రెండ్రోజులు ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఆ జిల్లాలేవో తెలుసా?

పూర్తి కథనం చదవండి

10:24 PM (IST) Apr 23

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ vs టాప్ 5 బౌలర్లు.. సూపర్ థ్రిల్ ఫైట్

Sachin Tendulkar Top 5 Iconic Cricket Rivalries: 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్, క్రికెట్‌లోని కొంతమంది గొప్ప బౌలర్లతో ప్రత్యర్థులుగా ఉన్నారు. షోయబ్ అక్తర్ వేగం నుండి షేన్ వార్న్ స్పిన్ వరకు, ఈ పోరాటాలు ఒక శకంగా నిలిచాయి. క్రికెట్ లవర్స్ కు మస్తు థ్రిల్ ను పంచాయి. 

పూర్తి కథనం చదవండి

10:18 PM (IST) Apr 23

Pahalgam Terror Attack : పాకిస్థాన్ ను వెలేసిన భారత్

భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్న పాకిస్ధాన్ ను భారత్ వెలేసింది. ఆ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ గానీ, యుద్దం గానీ ప్రకటించకుండానే భవిష్యత్ ను అందకారం చేసే కఠిన నిర్ణయాలు తీసుకుంది. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకుని కీలక నిర్ణయాలివే.. 

పూర్తి కథనం చదవండి

10:08 PM (IST) Apr 23

పహల్గాం ఉగ్రదాడి : తమన్నా, కీర్తి సురేష్, రష్మిక, హన్సిక ల రియాక్షన్ ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటనపై నటీమణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి స్పందనల గురించి ఇక్కడ తెలుసుకోండి.
 

పూర్తి కథనం చదవండి

08:58 PM (IST) Apr 23

SRH vs MI: ఇషాన్ కిష‌న్ కు ఏమైనా పిచ్చిప‌ట్టిందా.. ఏంది సామి ఇది

SRH vs MI Ishan Kishan: ఐపీఎల్ 2025 లో ముంబై vs హైదరాబాద్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలివెళ్లిపోయాడు. ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్నఅభిమానులు కూడా షాక్ అయ్యారు. కొంత సమయం ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి కనిపించింది. మొత్తంగా హైద‌రాబాద్ టీమ్ ను క‌ష్టాల్లోకి ప‌డేశాడు.  
 

పూర్తి కథనం చదవండి

08:56 PM (IST) Apr 23

Gmail Scam Alert : గూగుల్ నుంచి ఈమెయిల్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

జిమెయిల్ యూజర్లకు గూగుల్ కంపెనీ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ పేరుతో వస్తున్న ఈమెయిల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

పూర్తి కథనం చదవండి

08:25 PM (IST) Apr 23

Pahalgam Terror Attack : ప్రధాని మోదీ కీలక సమావేశం... ఇదే సమయంలో టిఆర్ఎఫ్ కమాండర్ ట్రాప్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ కమాండర్ ను భద్రతా బలగాలు ట్రాప్ చేయడం గమనార్హం. 

పూర్తి కథనం చదవండి

08:08 PM (IST) Apr 23

Pahalgam terror attack: ఇదో పిరికిదాడి.. అండగా ఉంటాం.. హార్దిక్ పాండ్యా ఫైర్

Pahalgam terror attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ భార‌తావ‌ని షాక్ కు గురైంది. ఈ దాడిలో 28 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మ‌న క్రికెట‌ర్లు గళం విప్పారు. ఈ క్ర‌మంలోనే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధితుల‌కు సంతాపం తెలుపుతూ.. ఒక జ‌ట్టుగా, ఫ్రాంచైజీగా ఇలాంటి దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి

08:06 PM (IST) Apr 23

ప్రభాస్ తో ఇలియానా, ఛార్మి , ఆర్తి అగర్వాల్ నటించిన ఫ్లాప్ మూవీస్ గురించి తెలుసా ?

బాహుబలితో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆదిపురుష్ నుండి రాధే శ్యామ్ వరకు, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమాల గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

07:35 PM (IST) Apr 23

Pahalgam Terror Attack : టిఆర్ఎఫ్ కమాండర్ ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు 

పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన టిఆర్ఎఫ్ కమాండర్  ఆసిఫ్ పౌజీని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.

పూర్తి కథనం చదవండి

07:08 PM (IST) Apr 23

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి.. నా గుండె ముక్కలైంది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Pahalgam terror attack: కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 28 మందికి పైగ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్ర‌మంలోనే భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ త‌న గుండె ప‌గిలిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

పూర్తి కథనం చదవండి

07:01 PM (IST) Apr 23

Password: మీ FB, Insta, Gmail పాస్‌వ‌ర్డ్‌లు మ‌ర్చిపోయారా.? ఫోన్‌లోనే అన్నీ ఉంటాయ్ ఎలా చూసుకోవాలంటే

ప్ర‌స్తుతం స్మార్ట్ ఉప‌యోగించ‌ని వారు లేర‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇంట‌ర్నెట్ ఛార్జీలు త‌గ్గ‌డం, యూజ‌ర్ ఫ్రెండ్లీ యాప్స్ అందుబాటులోకి రావ‌డంతో చాలా మంది ఫోన్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఫోన్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో హిడెన్ ఫీచ‌ర్లు ఉంటాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

06:57 PM (IST) Apr 23

Revanth Reddy Japan Visit : తెలంగాణలో జపాన్ సంస్థలు పెట్టే పెట్టుబడులెన్ని? వచ్చే ఉద్యోగాలెన్నో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఓ టీమ్ వారంరోజుల పాటు జపాన్ లో పర్యటించింది. మంగళవారంతో ఈ పర్యటన ముగియగా బుధవారం ఉదయం రేవంత్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు వచ్చే పెట్టుబడులెన్ని? తద్వారా ఏర్పడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలెన్ని? ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:46 PM (IST) Apr 23

Pahalgam Terror Attack : ఉగ్రవాదులు వాడిన కోడ్ నేమ్స్ ఇవే...

పహల్గాం బైసన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు మరణించారు. అయితే ఆ దాడికి పాల్పడిన ముష్కరులు కోడ్ నేమ్స్ వాడినట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసా?   

పూర్తి కథనం చదవండి

05:42 PM (IST) Apr 23

IPL 2025 SRH vs MI: న‌ల్ల బ్యాండ్‌లు ధ‌రించ‌నున్న ప్లేయ‌ర్లు.. ఎందుకంటే?

IPL 2025 SRH vs MI: కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి యావ‌త్ భార‌తావ‌నిని క‌దిలించింది. బాధితులకు నివాళిగా ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ vs  ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించనున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

05:13 PM (IST) Apr 23

Pahalgam terror attack : పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసత్వం... కాల్పుల వీడియో తీసుకునేందుకు ప్రత్యేక సెటప్

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పుల సమయంలో ఉగ్రవాదులు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారు ప్రత్యేక సెటప్ ను ఉపయోగించారట. 

పూర్తి కథనం చదవండి

04:48 PM (IST) Apr 23

Gold: భారీ త‌గ్గిన బంగారం ధ‌ర.. ఒక్క‌రోజే ఏకంగా రూ. 3వేలు డౌన్‌.. ఇంకా త‌గ్గ‌నుందా?

బంగారం అనే మాట ప‌ల‌కాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చిన విషయం తెలిసిందే. తులం బంగారం రూ. ల‌క్ష అవుతుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వింటూ వ‌చ్చాం. అయితే తాజాగా ఆ మార్కును కూడా దాటేసింది. ల‌క్ష దాటి ఇంకా పరుగులు పెట్టింది. అయితే అనూహ్యంగా బుధ‌వారం బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. బుధ‌వారం ఒక్క‌రోజే తులంపై ఏకంగా రూ. 3 వేల వ‌ర‌కు త‌గ్గింది. ఇంత‌కీ ప్ర‌స్తుతం బంగారం ధ‌ర ఎంత ఉంది.? ఈ త‌గ్గుదల ఇలాగే కొన‌సాగుతుందా.? తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:38 PM (IST) Apr 23

Pahalgam Terror Attack : భార్యాబిడ్డల కళ్లముందే హైదరబాదీని... వెంటాడిమరి విశాఖవాసిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 28 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు ముష్కరులు. ఇందులో ముగ్గురు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన పర్యాటకులు ఉన్నారు. వారి వివరాలిలా ఉన్నాయి...   

పూర్తి కథనం చదవండి

03:18 PM (IST) Apr 23

ఒక్క సినిమాతో 50 కోట్ల నష్టం..అట్టర్ ఫ్లాప్ కావడంతో నయనతార ఇమేజ్ కి పెద్ద దెబ్బ

నయనతార నటించిన టెస్ట్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ భారీ నష్టాన్ని చవిచూసిందట.

పూర్తి కథనం చదవండి

03:09 PM (IST) Apr 23

కశ్మీర్ లో చిత్రీకరించబడిన 8 క్రేజీ చిత్రాలు, రాజమౌళి తండ్రి కథ అందించిన సూపర్ హిట్ మూవీ

కశ్మీర్‌లో చాలా బాలీవుడ్ సినిమాలు చిత్రీకరించబడ్డాయి, కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. కశ్మీర్ లో చిత్రీకరించబడిన ఏ సినిమాలు విజయం సాధించాయో, ఏవి విఫలమయ్యాయో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

03:07 PM (IST) Apr 23

JD Vance: క‌శ్మీర్ దాడితో అల‌ర్ట్.. అమెరికా ఉపాధ్య‌క్షుడి కోసం 2200 మంది పోలీసుల‌తో భ‌ద్ర‌తా

పహల్గాం దాడి తర్వాత జైపూర్‌లో అమెరికా ఉపాధ్యక్షుడి భద్రత పెంచారు. ఆయన బస చేసిన హోటల్‌ని చుట్టుముట్టారు, 24 వరకు బుకింగ్‌లు రద్దు చేశారు. అమెరికా ఉపాధ్య‌క్షుడి భ‌ద్ర‌తా కోసం అధికారులు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

02:33 PM (IST) Apr 23

AP 10th: సైన్స్‌లో ఒక మార్కు.. మిగిలిన సబ్జెక్టుల్లో సున్నా.. 600కి 600 ఇంకోచోట.. వింత ఫలితాలు!

AP 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు ఈసారి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓ విద్యార్థికి 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. మరోచోట ఓ విద్యార్థినికి  ఒక్క మార్కు కూడా తగ్గకుండా.. 600కి 600 మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు చూసిన తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

02:31 PM (IST) Apr 23

సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అయితే భారీగా వసూలు చేసే  విలన్ గురించి మీకు తెలుసా? ఒక్క సినిమాకే 200 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఆ నటుడు ఎవరు? 

పూర్తి కథనం చదవండి

02:21 PM (IST) Apr 23

Pahalgam Terror Attack: ఉగ్ర‌వాదుల ల‌క్ష్యం అదే.. క‌శ్మీర్ ఉగ్ర‌ దాడిపై స‌ద్గురు ఏమ‌న్నారంటే

ప్ర‌శాంత క‌శ్మీర్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడిపై యావ‌త్ దేశం స్పందిస్తోంది. దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఉగ్ర‌దాడి వ్య‌తిరేకంగా ర్యాలీలు నిర్వ‌హించారు. ఇక ఈ దాడిని సామాన్యులు మొద‌లు సెల‌బ్రిటీల వ‌ర‌కు ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పిరికి పంద చ‌ర్య అని, క‌శ్మీర్‌లో అల్ల‌క‌ల్లోలం సృస్టించేందుకే ఇలాంటి ఇలా చేశారంటూ విమ‌ర్శిస్తున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

01:42 PM (IST) Apr 23

విజ్డెన్ లీడింగ్ క్రికెటర్స్ ఇన్ వరల్డ్ గా జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన

Wisden's Leading Cricketers in the World: భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత స్టార్ మహిళా క్రికెట్ స్మృతి మంధానలకు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డులు లభించాయి. గతంలో భారత్ నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని భారత దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు అందుకున్నారు.

పూర్తి కథనం చదవండి

01:40 PM (IST) Apr 23

Samsung: మీరు నడిస్తే చాలు.. గెలాక్సీ వాచ్ అల్ట్రా ఫ్రీగా పొందొచ్చు. ఎలాగంటే..

Samsung Walkathon India Challenge: శాంసంగ్ కంపెనీ ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. కేవలం నడిస్తే గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా పొందే అవకాశాన్నిస్తోంది. దీని కోసం వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో కంపెనీ రూల్స్ పాటిస్తూ నడిస్తే ఉచితంగా గెలాక్సీ వాచ్ అల్ట్రాను పొందే అవకాశం ఉంటుంది. 

పూర్తి కథనం చదవండి

01:21 PM (IST) Apr 23

Pahalgam Terror: ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన వ్య‌క్తి భార్య‌తో మాట్లాడిన ఎంపీ తేజ‌స్వి.. అండ‌గా ఉంటామ‌ని హామీ

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన శివమొగ్గకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ భార్య పల్లవిని పార్లమెంట్ సభ్యుడు, బిజెపి యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య కశ్మీర్ లో  కలిశారు. ఈ క్లిష్ట‌మైన సమయంలో తేజస్వి సూర్య, ఎమ్మెల్యే సునీల్ శర్మతో కలిసి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 
 

పూర్తి కథనం చదవండి

01:08 PM (IST) Apr 23

LSG vs DC: ఓటమికి కారణం ఎవరు? పంత్, జహీర్ వాగ్వాదం.. ఎల్ఎస్జీలో ఏం జరుగుతోంది?

Pant and Zaheer dugout argument after LSG loss: ఐపీఎల్ 2025 లక్నో vs ఢిల్లీ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆలస్యంగా బ్యాటింగ్ కి రావడంపై వివాదం కొనసాగుతోంది. అవుటైన తర్వాత  కోపంగా పెవిలియన్ కి వెళ్ళిన పంత్ జహీర్ ఖాన్ తో వాగ్వాదం చేస్తున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి

01:08 PM (IST) Apr 23

Kashmir Terrorist Attack: పెళ్లైన వారానికే నేవీ ఉద్యోగి మృతి.. తల్లడిల్లిన భార్య.. ఐడీ చూసి చంపిన ఉగ్రవాదులు!

Kashmir Terrorist Attack: వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉందామని నిశ్చయించుకున్నారు.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసి.. ఏడు రోజులు కాకుండానే విధి దూరం చేసింది. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేవీ ఉద్యోగి 26 ఏళ్ల వినయ్ నర్వాల్ చనిపోయాడు. ఇటీవలే ఇతనికి పెళ్లి కాగా.. భార్యతో కలిసి హనీమూన్‌ చేసుకోవడానికి కశ్మీర్‌ వచ్చారు. ఆక్రమంలో ఉగ్రమూకల దాడికి బలైపోయాడు. 
 

పూర్తి కథనం చదవండి

12:30 PM (IST) Apr 23

పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరిగిన 9 సినిమాలు ఏవో తెలుసా?

పహల్గాంలో 26 మంది హిందువుల ఊచకోత జరిగింది. హిందువులు అని కన్ ఫార్మ్ చేసుకుని మరీ వరుసగా నిలబెట్టి టూరిస్ట్ లను  ఉగ్రవాదులు చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశం, భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడుతుంది. ఈ ఘోరం జరిగిన ప్రదేశంలో 9 సినిమాల షూటింగ్ జరిగాయని మీకు తెలుసా? 

పూర్తి కథనం చదవండి

12:05 PM (IST) Apr 23

Pahalgam Attack: క‌శ్మీర్‌లో దాడి చేసిన ఉగ్ర‌వాదులు ఎలా ఉంటారో తెలుసా.? స్కెచ్‌లు విడుద‌ల చేసిన అధికారులు

కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి విషయంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను సంస్థలు విడుదల చేశాయి.. 

పూర్తి కథనం చదవండి

10:27 AM (IST) Apr 23

AP 10th Results: పది తరగతి ఫలితాలు.. 81 శాతం ఉత్తీర్ణత.. ఆ జిల్లాలు టాప్‌.. సప్లిమెంటరీ ఎప్పుడంటే?

AP 10th Results: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది. 

పూర్తి కథనం చదవండి

10:25 AM (IST) Apr 23

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మృతి.. మృతుల వివ‌రాలు ఇవే

పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు బలయ్యారు. ఉగ్రమూకల దాడిలో భారతదేశంలోని పర్యాటకులు, నేపాల్ జాతీయుడు సహా మొత్తం 26 మంది మరణించారు. దీంతో అధికారులు జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పెంచారు. మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు. 

పూర్తి కథనం చదవండి

More Trending News