MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Pahalgam Terror Attack : పాకిస్థాన్ ను వెలేసిన భారత్

Pahalgam Terror Attack : పాకిస్థాన్ ను వెలేసిన భారత్

భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్న పాకిస్ధాన్ ను భారత్ వెలేసింది. ఆ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ గానీ, యుద్దం గానీ ప్రకటించకుండానే భవిష్యత్ ను అందకారం చేసే కఠిన నిర్ణయాలు తీసుకుంది. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకుని కీలక నిర్ణయాలివే.. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 23 2025, 10:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ ఎటాక్ తర్వాత, భారత్ ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం జరిగింది. జాతీయ భద్రతపై నిర్ణయం తీసుకునే అత్యున్నత సంస్థ ఇది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఇప్పటికే పాకిస్థాన్ తో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి... ఇప్పుడు ఆ దేశంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. పాకిస్థానీయులను దేశంలో అడుగుపెట్టనివ్వొద్దని నిర్ణయించారు.  అటారి-వాఘా చెక్‌పోస్ట్‌ మూసివేయాలని... ఇకపై పాకిస్థానీయులకు వీసాలు ఇవ్వకూడదని నిర్ణయించారు.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

పాక్ పౌరులకు 48 గంటల డెడ్ లైన్ : 

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాకిస్థాన్ హైకమీషన్ ను కూడా భారత్ నుండి వెళ్లగొట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.  

పహల్గాం ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. పహల్గామ్‌ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని... ఇందుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రకటించారు.

34
PM Narendra Modi in CCS Meeting

PM Narendra Modi in CCS Meeting

పాకిస్థాన్ తో సింధు జలాల ఒప్పందం నిలిపివేత  :

ఇక పాకిస్థాన్ తో గతంలో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేయనున్నట్లు కూడా భారత్ ప్రకటించింది.  భారత్, పాకిస్తాన్ మధ్య 19 సెప్టెంబర్ 1960న సింధు జల ఒప్పందం కుదిరింది.  ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం జరిగింది. భారత్ ఈ ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేసింది.  

సింధు జల ఒప్పందం ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య నదుల నీటి పంపిణీ జరిగింది. ఇది పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. సింధు జల ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు సింధు నది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీరు లభిస్తుంది. ఈ నదులు పాకిస్తాన్‌కు ప్రాణాధారం. ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఈ నదుల నీటిని నిలిపివేయగలదు. దీనివల్ల పాకిస్తాన్‌లో కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయి.
 

44
पहलगाम आतंकी हमला पर सुरक्षा समिति की बैठक करते पीएम मोदी।

पहलगाम आतंकी हमला पर सुरक्षा समिति की बैठक करते पीएम मोदी।

సింధు జల ఒప్పందం నిలిపివేత ప్రభావం ఏమిటి?

సింధు జల ఒప్పందం సింధు, దాని ఆరు ఉపనదులను రెండు వర్గాలుగా విభజిస్తుంది.

పశ్చిమ నదులు: సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రత్యేకంగా పాకిస్తాన్‌కు కేటాయించారు.

తూర్పు నదులు: రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్‌కు పూర్తి నియంత్రణ ఉంది.

భారత్ పశ్చిమ నదుల నీటిని తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ వంటి పరిమిత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు, కానీ అదనపు నీటిని మళ్లించలేదు. నీటిని నిల్వ చేయలేదు. ఈ నదులు ఏటా దాదాపు 33 మిలియన్ ఎకర అడుగుల (MAF) నీటిని తీసుకువెళతాయి. ఇప్పుడు భారత్ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
నరేంద్ర మోదీ
అమిత్ షా
ప్రపంచం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Recommended image2
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Recommended image3
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved