MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025 SRH vs MI: న‌ల్ల బ్యాండ్‌లు ధ‌రించ‌నున్న ప్లేయ‌ర్లు.. ఎందుకంటే?

IPL 2025 SRH vs MI: న‌ల్ల బ్యాండ్‌లు ధ‌రించ‌నున్న ప్లేయ‌ర్లు.. ఎందుకంటే?

IPL 2025 SRH vs MI: కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి యావ‌త్ భార‌తావ‌నిని క‌దిలించింది. బాధితులకు నివాళిగా ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ vs  ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించనున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 SRH vs MI: కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 28 మందికి పైగ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే బాధితులకు నివాళిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఎలాంటి సంబరాలు చేయ‌కూడ‌ద‌ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణ‌యం తీసుకుంది.

దీనిలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 23న) ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ బాధితులకు గౌరవ సూచకంగా, సానుభూతిని తెలుపుతూ ఎటువంటి బాణసంచా కాల్చ‌రు. అలాగే, చీర్లీడర్లు లేకుండా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Pahalgam terror attack

Pahalgam terror attack

మంగళవారం మధ్యాహ్నం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కాశ్మీర్ లోని పహల్గామ్‌లోని బైసరన్ పచ్చిక బయళ్ల సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో ఇద్దరు విదేశీయులు సహా  28 మంది మరణించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019 పుల్వామా సంఘటన తర్వాత కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.

35
Mumbai Indians and Sunrisers Hyderabad

Mumbai Indians and Sunrisers Hyderabad

న‌ల్ల బ్యాండ్లు ధ‌రించ‌నున్న‌ ఆటగాళ్లు, అంపైర్లు 

కాశ్మీర్ ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు, అంపైర్లు ఆట సమయంలో చేతికి నల్లటి బ్యాండ్‌లు ధరిస్తారు.

అంతేకాకుండా, మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఒక నిమిషం పాటు మౌనం పాటించి, ఈ విషాదాన్ని గుర్తుచేసుకుని, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ నివాళులు అర్పిస్తారు..

45
SRH vs MI

SRH vs MI

దాడిని ఖండించిన క్రికెటర్లు

భారత క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఎక్స్ వేదిక‌గా "పహల్గామ్ ఉగ్రవాద దాడి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి.  ఈ అర్థరహిత హింసాత్మక చర్యను ఖండిస్తున్నాను. ఈ క్లిష్ట సమయాల్లో ఐక్యత, మ‌ద్దతుతో మనం బలంగా నిల‌బ‌డాలి అని పేర్కొన్నారు. 

55

విరాట్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ విచారం వ్య‌క్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాల‌న్నారు. "పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర విచారం కలిగించింది. బాధితుల కుటుంబాలకు అండ‌గా నిల‌బ‌డాలి. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు శాంతి, బలం చేకూర్చాలనీ, ఈ క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని కోహ్లీ పేర్కొన్నాడు. 

అలాగే, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. ఇది పిరికి చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ప్రస్తుతం ఐపీఎల్ లో 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృనాల్ పాండ్యా దాడితో త‌న గుండె ముక్క‌లైంద‌ని పేర్కొన్నాడు. బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని చెప్పాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved