బోటు ప్రమాదం.... ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే...

By telugu teamFirst Published Sep 19, 2019, 7:41 AM IST
Highlights

ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ యువకుడు... అసలు ప్రమాదం ఎలా జరిగిందో వివరించాడు. అతను కూడా ఆ బోటులో ప్రయాణించగా... ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

‘‘రెప్పపాటులో సుడిగుండం బోటును తిప్పేసింది. ఈదుకుంటూ వచ్చి బోటును ఎక్కాను. అదే సమయంలో అర్జున్‌ పక్క నుంచి తేలాడు. నీరు మింగాడు. నా లైఫ్‌ జాకెట్‌ను అర్జున్‌కు ఇచ్చాను. మరికొంత దూరంలో తేలియాడుతున్న జాకెట్‌ను పట్టుకున్నాను. అక్కడి నుంచి నది ఒడ్డు సుమారు 200 మీటర్లు ఉంది. ఈదుకుంటూ వెళ్తుండగా చిన్న పాప కనిపించడంతో పట్టుకున్నాను. అప్పటికే పాప చనిపోయింది. మరో వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా అతడిని లాక్కుంటూ వచ్చాను. అంతలోనే జాలర్లు వచ్చి మమ్మల్ని బోటులో ఎక్కించుకున్నారు. నేను ఎన్‌సీసీ క్యాడెట్‌ కావడంతో మనోధైర్యంగా ఉండగలిగాను". అంటూ బోటు ప్రమాదం నుంచి తప్పించుకున్న జరణీకుమార్ తెలిపారు.

ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

బోటు మునక: 24 మృతదేహాల వెలికితీత, రెస్క్యూ ఆపరేషన్

210 అడుగుల లోతులో బోటు: మరో మూడు మృతదేహాలు వెలికితీత

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!