Vijayawada: గత నెల 9న ఏలూరులో వార్డు, గ్రామ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పరువు నష్టం దావా నమోదైంది. మహిళలు, బాలికల అదృశ్యం, మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల ప్రమేయం ఉందన్న కళ్యాణ్ ఆరోపణ తనను మానసిక వేదనకు గురిచేసిందనీ, ప్రభుత్వ సేవలు అందిస్తున్న లక్షలాది మంది వాలంటీర్ల ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఓ మహిళా వాలంటీర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వలంటీర్ పిటీషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.