Janasena Pawan Kalyan: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీని సాగనంపాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారనీ, ఈ విషయం పలు సర్వేల్లో వెల్లడవుతున్నని అన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కాపు పెద్దలకు ఓ బహిరంగ లేఖ రాశారు.