Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికులు చేస్తున్ననిరసనలు 300 రోజులను దాటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్మికులు సిద్ధమయ్యారు. దీనికి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన సైతం మద్దతు తెలిపింది, జనసేనాని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ సైతం రాసినట్టు ఆ పార్టీ పేర్కొంది. అయితే, Visakha Steel Plant విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి లేఖలు రాయలేదని కేంద్రం వెల్లడించింది.