
medaram jatara video : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష
మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమావేశం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమావేశం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

గత రెండుసార్లు జాతరలో భక్తులకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు ఈసారి ఆ లోపాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశారని, వెంటనే ఈ జాతరకు సంబంధించిన 21 డిపార్ట్ మెంట్లు వారి పనులను ప్రారంభించాలని, సంక్రాంతిలోపు పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.