Asianet News TeluguAsianet News Telugu

జనగామ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర... స్టేషన్ ఘనపూర్ లో భారీ బహిరంగ సభ..

జనగామ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన మహాప్రస్థాన పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. 

జనగామ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన మహాప్రస్థాన పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని గర్నెపల్లి నైట్ క్యాంప్ నుండి ఉదయం  10 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. వైసిపి శ్రేణులు వెంటరాగా జఫర్ గడ్ మండల పరిధిలోని తిడుగు, కొనయిచలం, కస్న తాండా, దుర్గ్యా తాండా, తిమ్మంపేట, నమిలిగొండ మీదుగా స్టేషన్ ఘనపూర్ వరకు షర్మిల పాదయాత్ర సాగనుంది.  సాయంత్రం 4 గంటలకు స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద భారీ బహిరంగ నిర్వహించనున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే  వైఎస్సార్ టిపి ఏర్పాట్లు పూర్తిచేసింది.