Asianet News TeluguAsianet News Telugu

ఈ బస్సుల్లో ప్రయాణం అమ్మ ఒడి అనుభూతేనట... టీఎస్ ఆర్టిసి ఏసి స్లీపర్స్ ప్రారంభం

హైదరాబాద్ : ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లచల్లగా, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఏసి స్లీపర్ బస్సులను ప్రారంభించింది.

హైదరాబాద్ : ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లచల్లగా, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఏసి స్లీపర్ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ నుండి విజయవాడకు నడిచే ఈ ఏసి బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎల్బి నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఆర్టిసి ఎండి సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. 

మొదటి విడతగా విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్లీ కి ఈ ఏసి స్లీపర్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు టీఎస్ ఆర్టిసి తెలిపింది.  ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. 'లహరి-అమ్మఒడి అనుభూతి' పేరిట ఈ బస్ సర్వీసులు నడవనున్నాయి.