
India First Rocket Manufacturing Factory In Hyderabad
ఐటీ, బయోటెక్ హబ్గా ఎదిగిన భాగ్యనగరం.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఫ్యాక్టరీని వర్చువల్గా ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దాదాపు 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.