గోదావరిఖనిలో పాతకక్షలతో వ్యక్తి తల్వార్లు, కత్తులతో దాడి..

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో రౌడీషీటర్ మంథని సుమన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, తల్వార్లతో దాడి చేసి దారుణంగా హత మార్చారు.

First Published Jan 30, 2023, 11:38 AM IST | Last Updated Jan 30, 2023, 11:38 AM IST

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో రౌడీషీటర్ మంథని సుమన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, తల్వార్లతో దాడి చేసి దారుణంగా హత మార్చారు. చౌరస్తాలోని సుమన్ కు సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి బయటికి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కత్తులు, తల్వార్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సుమన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఈ సంఘటన పాత కక్షల నేపథ్యంలోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

గతంలో హనుమాన్ నగర్ చెందిన శివకుమార్ ను హత్య చేసిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుమన్ ను హతమార్చేందుకు పక్కా పథకం పన్నినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఘటన స్థలాన్ని ఏసీబీ గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలించారు. పట్టణ ప్రధాన చౌరస్తాలో గాంధీ సాక్షిగా దారుణం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కోల్ బెల్టు ప్రజలు ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల క్రితం చార్జి తీసుకున్న రామగుండం సిపి రేమో రాజేశ్వరి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.