Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో తల్లీకొడుకుపై హత్యాయత్నం... శరీరంలో కత్తితోనే హాస్పిటల్ కు

కరీంనగర్ :  తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు.

కరీంనగర్ :  తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. చెల్లిని పెళ్లాడిన యువకుడితో పాటు అతడి తల్లిపైనా కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

చిగురుమామిడికి చెందిన గడ్డం చందు, జగిత్యాలకు చెందిన నందిత ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టంలేని యువతి సోదరుడు గడ్డం రాజు ఆవేశంతో రగిలిపోయి మృగంగా మారాడు. స్నేహితుడితో కలిసి చందు ఇంటికెళ్లిన రాజు కత్తితో దాడికి దిగాడు. కొడుకుపై దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన తల్లి స్వప్న పైనా దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన తల్లీ కొడుకులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.