Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ రద్దు...కొనసాగుతున్న వ్యవసాయ మంత్రి పర్యటన

వరంగల్: తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న పంటను పరిశీలించాలని భావించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సిద్దమై చివరి నిమిషంలో టూర్‌ను ర‌ద్దు చేసుకున్నార‌ు. ఆయన స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కూడిన బృందం వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టింది.మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి వ్యవసాయ మంత్రి సారధ్యంలోని రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులతో కూడిన బృందం ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ బయలుదేరారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను ఈ బృందం పరిశీలిస్తోంది. 

వరంగల్: తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న పంటను పరిశీలించాలని భావించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సిద్దమై చివరి నిమిషంలో టూర్‌ను ర‌ద్దు చేసుకున్నార‌ు. ఆయన స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కూడిన బృందం వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టింది.మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి వ్యవసాయ మంత్రి సారధ్యంలోని రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులతో కూడిన బృందం ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ బయలుదేరారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను ఈ బృందం పరిశీలిస్తోంది.