Asianet News TeluguAsianet News Telugu

గాంధీ జయంతి స్పెషల్... హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్

హైదరాబాద్ : జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ లో జరిగిన రన్ ఫర్ పీస్ ను టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు.

హైదరాబాద్ : జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ లో జరిగిన రన్ ఫర్ పీస్ ను టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10K, 5K, 3K రన్ ను ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పీస్ రన్ కార్యక్రమానికి విచ్చేసివారంతా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ బొటానికల్ గార్డెన్ అభివృద్ది పనులకు ఎంపీ నిధుల నుండి రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా తలో పదిలక్షలు చొప్పున గార్డెన్ అభివృద్దికి కేటాయించనున్నట్లు తెలిపారు. ఇలా బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి మొత్తం రూ.40 లక్షల నిధులు కేటాయించిన నాయకులకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 

Video Top Stories