userpic
user icon

దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియల్ వ్యూ... పరిశీలించిన సీఎం కేసీఆర్

Chaitanya Kiran  | Published: Nov 28, 2022, 3:21 PM IST

నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం రూ.29 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం దామరచర్ల వద్ద నిర్మిస్తున్న  పవర్ ప్లాంట్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన పనులు, ఇకపై జరగాల్సిన పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. 

Video Top Stories

Must See