Asianet News TeluguAsianet News Telugu

అమరవీరులకు నివాళులర్పించిన ఏపీ టీఆర్ఎస్ అభిమాని (వీడియో)

బెజవాడకు చెందిన కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో పార్టీ టిక్కెట్ కేటాయించాల్సిందిగా పెద్దలను కోరేందుకు ఆదినారాయణ హైదరాబాద్ వచ్చారు

బెజవాడకు చెందిన కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో పార్టీ టిక్కెట్ కేటాయించాల్సిందిగా పెద్దలను కోరేందుకు ఆదినారాయణ హైదరాబాద్ వచ్చారు.

తెలంగాణ భవన్‌కు వెళ్లేముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీని ఓడించడమే లక్ష్యమని తెలిపారు. డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరి కాయలు కొట్టి ఈయన వార్తల్లోకి ఎక్కారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోకాళ్లతో ఇంద్రకీలాద్రి కొండ ఎక్కారు. బెజవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ఆదినారాయణ... టీఆర్ఎస్ టికెట్‌పై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పానన్నారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతో పాటే తాను కేసీఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.