
వరల్డ్ ఖోఖో కప్కి చేరువలో భారత్: ఇండియా Vs శ్రీలంక హోరాహోరీ పోరు
ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఖోఖో సమరంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. అటు పురుషులు, ఇటు మహిళల జట్టు అద్భుతంగా ఆడుతూ టైటిల్ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖోఖో ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత పురుషుల జట్టు... మరో విక్టరీ సాధించింది. శుక్రవారం (జనవరి 17న) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.