Asianet News TeluguAsianet News Telugu

హెచార్కె ప్రతిపాదన మూర్ఖత్వం: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విలీనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త, ఆలోచనాపరుడు హెచార్కె ఇటీవల ఏషియానెట్ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రతిపాదించారు. 

First Published Jul 12, 2022, 5:52 PM IST | Last Updated Jul 12, 2022, 5:52 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విలీనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త, ఆలోచనాపరుడు హెచార్కె ఇటీవల ఏషియానెట్ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రతిపాదించారు. దానిపై ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. హెచార్కెది మూర్ఖమైన ఆలోచన అని ఆయన అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వినించారు. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డిని ఏషియానెట్ న్యూస్ తెలుగు కోసం ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం. పూర్తి ఇంటర్వ్యూను త్వరలో మీకోసం అందిస్తాం.