
Thandel: సాయిపల్లవి అన్యాయం చేసింది.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్
నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్ పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు ఇందులో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సాయిపల్లవి అన్యాయం చేసిందంటూ కామెంట్ చేశారు.