MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా

Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పాకిస్తాన్ తీవ్ర ప్రతిస్పందన ఇస్తుందని చెప్పింది. సరిహద్దులో కాల్పులు కొనసాగుతున్నాయి. 

1 Min read
Narender Vaitla
Published : May 07 2025, 04:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు చేసింది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని పాక్ చెబుతోంది. 

27
Asianet Image

మరోవైపు, భారతదేశం దాడి చేసిందని పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్, మురిడ్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్, కోట్లీ, బాగ్‌లలో దాడులు జరిగాయని తెలిపింది.

Related Articles

Operation sindoor: భార‌త్ దాడులు యుద్ధంతో స‌మానం.. తీవ్రంగా స్పందించిన పాక్ ప్రధాని
Operation sindoor: భార‌త్ దాడులు యుద్ధంతో స‌మానం.. తీవ్రంగా స్పందించిన పాక్ ప్రధాని
Operation sindoor: భార‌త్‌తో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. బండి సంజ‌య్ ట్వీట్
Operation sindoor: భార‌త్‌తో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. బండి సంజ‌య్ ట్వీట్
37
Asianet Image

ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందిస్తూ, "భారతదేశం మోసపూరితంగా పాకిస్థాన్‌లోని ఐదు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ చర్యలు యుద్ధానికి సమానమైనవే. పాకిస్థాన్ తగిన సమాధానం తప్పక ఇస్తుంది. దేశం మొత్తం సైన్యం వెనుక నిలిచింది. శత్రువు కుట్రలు విఫలమవడం ఖాయం" అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

47
Asianet Image

భారతదేశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను విభజించే నియంత్రణ రేఖ వెంబడి భారీ కాల్పులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి.  పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులకు దిగగా, భారత దళాలు కూడా ప్రతికర్యగా కాల్పులు జరిపాయి. దీంతో ఎల్‌వోసీ ప్రాంతం చుట్టుపక్కల వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

57
Asianet Image

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మదరసాలు, మసీదుల నుండి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. భారత దాడులు జరిగిన వెంటనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను 48 గంటలపాటు మూసివేసింది. 

67
Asianet Image

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున భారతీయ దళాలు క్షిపణి దాడులు చేశాయి.  జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా గ్రూపుల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

77
Asianet Image

పాకిస్తాన్ భూభాగంలో భారత క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. ఈ పరిణామం ఊహించినదేనని, భారత్, పాకిస్తాన్ లు శత్రుత్వాలను త్వరగా ముగించాలని కోరారు.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
భారత దేశం
పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved