ముంబై పై హైదరాబాద్ విజయం: కోల్కత ను అస్సాం ట్రైన్ ఎక్కించి ప్లే ఆఫ్స్ చేరిన సన్ రైజర్స్
IPL 2020 సీజన్లో ప్లేఆఫ్ బెర్త్ను ఘనవిజయంతో కన్ఫార్మ్ చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్.
IPL 2020 సీజన్లో ప్లేఆఫ్ బెర్త్ను ఘనవిజయంతో కన్ఫార్మ్ చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్, టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్పై ఈజీ విక్టరీ సాధించింది సన్రైజర్స్. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా కలిసి మొదటి వికెట్కి 150+ పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ముంబై బౌలర్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు.ఈ విజయంతో ప్లేఆఫ్ చేరిన సన్రైజర్స్ హైదరాబాద్ నవంబర్ 6న రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్లో ఎలిమినేటర్ మ్యాచ్లో తలబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఓడిన జట్టుతో ఫైనల్ చేరేందుకు పోటీపడే అవకాశం దక్కుతుంది.