
YS Jagan Serious: ఎరువులు బ్లాక్ లో కొనే పరిస్థితి ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు
బ్రహ్మణపల్లె పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడైన అరటి పంటలను పరిశీలించారు. వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బ్రహ్మణపల్లెలో పర్యటించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై గట్టి స్వరంతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎరువులు బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి రాలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.