Asianet News TeluguAsianet News Telugu

నరహంతకుడైన చంద్రబాబు మహా స్వామిజీపై విమర్శలా...: ఎమ్మెల్యే విష్ణు ఆగ్రహం

విశాఖ శారదా పీఠం స్వామీజీ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 

విశాఖ శారదా పీఠం స్వామీజీ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్న నర హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు. విజయవాడ నగరంలో హిందూ దేవాలయాలను కూల్చి వేసిన చంద్రబాబు ఈరోజు పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. శారదా పీఠంలోనీ రాజశ్యామల అమ్మవారి సేవలు అందిస్తున్న మహా స్వామీజీని విమర్శించడం చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మహ స్వామీజీ పట్ల చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదని, చంద్రబాబు మాటలు వెనక్కి తీసుకోవాలని స్వామీజీకి క్షమాపణ చెప్పాలని సూచించారు.