Asianet News TeluguAsianet News Telugu

పివి నుండి జగన్ వరకు... రాజశ్యామల అమ్మవారి కృపతోనే..: విశాఖ శారదా పీఠాధిపతి

విశాఖపట్నం : మాజీ ప్రధాని పివి నరసింహారావు నుండి నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు రాజశ్యామల అమ్మవారి కృపను పొందారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదని..

విశాఖపట్నం : మాజీ ప్రధాని పివి నరసింహారావు నుండి నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు రాజశ్యామల అమ్మవారి కృపను పొందారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదని... అమ్మవారి అనుగ్రహం ఉన్నవారే యాగానికి వస్తారన్నారు. ఇలా రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి కృపను పొందినవారు అదృష్టవంతులని స్వరూపానందేంద్ర అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి నేడు ముగిసింది. ఈ పూర్ణాహుతికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర లతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌ జడ్జి బద్రీనారాయణ పాల్గొన్నారు.