Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు షాపులు లూటీ...

గుంటూరు : ఏపీలో గుంటూరు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. 

గుంటూరు : ఏపీలో గుంటూరు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నందిపాడు మెయిన్ సెంటర్లో రామాలయం సమీపంలో రెండు షాపుల రేకుల పైకి ఎక్కి రేకులను లాగి దొంగతనానికి పాల్పడ్డారు. రెండు షాపుల్లో దొంగలు సుమారుగా 53 వేల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఎప్పుడూ రద్దీగా ఉండి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో అర్ధరాత్రి సమయంలో ఈ దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.