Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం ... అన్నాచెల్లితో సహా ముగ్గురు దుర్మరణం

విశాఖపట్నంలో గత అర్దరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది.


విశాఖపట్నంలో గత అర్దరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో వున్న ఎనిమిది మందిలో ముగ్గురు మృతిచెందగా మిగతా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో అన్నాచెల్లెళ్లు సాకేటి దుర్గాప్రసాద్(17), అంజలి(14)తో పాటు బిహార్ కు చెందిన చోటు వున్నారు. నిన్ననే అంజలి పుట్టినరోజు జరుపుకోగా రాత్రి జరిగిన ప్రమాదంలో మృతిచెందింది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్డిఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకుతీసి హాస్పిటల్ కు తరలించారు.