Asianet News TeluguAsianet News Telugu

పొస్కో‌-జగన్ సర్కార్ చీకటి ఒప్పందతోనే... ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణ: బోండా ఉమ

విజయవాడ: విశాఖ ఉక్కు ఎందరో మహానుభావులు సాధించిన విజయమని... 

విజయవాడ: విశాఖ ఉక్కు ఎందరో మహానుభావులు సాధించిన విజయమని... అలాంటి ప్రతిష్టాత్మక ప్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి వైసిపి ప్రభుత్వం పొస్కో కంపెనీతో చీకటి ఒప్పందం చేసుకుందని టిడిపి నాయకుడు బోండా ఉమ ఆరోపించారు. నీకింత నాకు ఇంత అనే ధోరణిలోనే ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపించారు. కృష్ణపట్నంలో కడపలో ఉక్కు కర్మాగారం పెట్టమని అడిగామని చెప్పారని... ఏ విధంగా వారితో ఒప్పందం కుదుర్చుకున్నారో బహిర్గతం చేయాలనీ డిమాండ్ చేశారు. వైసిపి ఎంపీలందరూ రాజీనామా చేయాలని ఉమ డిమాండ్ చేశారు.