దొంగఓట్లతో మేధావుల సభకా..! ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లూ జాగ్రత్త :అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నవారు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.

Share this Video

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నవారు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.వైసిపి ఎలాగూ గెలవదని తెలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగఓట్లు సృష్టించిందని... గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దొంగ ఓట్లా అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. మేధావుల సభకి దొంగ ఓట్లతో వెళ్తారా? అని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీను ఓకే ఫోన్ నెంబర్ తో 60 దొంగ ఓట్లు సృష్టించాడని ఆరోపించారు. ఇవన్ని గమనిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రులు విజ్ఞతతో ఓటేయాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

Related Video