
Video news : కన్నతండ్రి ప్రాణం తీసేలా చేసిన ఆస్తితగాదాలు
ఆస్తి తగాదా విషయమై కన్నతండ్రిని కత్తితో పొడిచి కడతేర్చిన ఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం పాత ఈదర గ్రామంలో బుధవారం జరిగింది.
ఆస్తి తగాదా విషయమై కన్నతండ్రిని కత్తితో పొడిచి కడతేర్చిన ఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం పాత ఈదర గ్రామంలో బుధవారం జరిగింది. రైతు బెక్కం శోభనాద్రిని అతని ఏకైక కుమారుడు డెక్కన్ కిరణ్ బుధవారం ఉదయం కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనికి కారణం ఆస్తి తగాదాలేనని ప్రాథమిక సమాచారం. భర్త హత్యోదంతం తెలియగానే భార్య నాగమల్లేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ హత్యకు సంబంధించి ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
