
Pawan Speech in DDO Offices Opening: మాకు కమిట్మెంట్ ఉంది.. అన్నీ చేస్తున్నాం
పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేలా పని చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించి.. అక్కడి నుంచి రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందన్నారు. సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.