Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలయ్య, లోకేష్... చంద్రబాబుతో ములాఖత్

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ కలిసారు. జైలు అధికారులు చంద్రబాబుతో ములాఖత్  కు అవకాశం ఇవ్వడంతో పవన్, బాలయ్య రాజమండ్రికి చేరుకోగా జైలువద్ద నారా లోకేష్ కలిసారు. 

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ కలిసారు. జైలు అధికారులు చంద్రబాబుతో ములాఖత్  కు అవకాశం ఇవ్వడంతో పవన్, బాలయ్య రాజమండ్రికి చేరుకోగా జైలువద్ద నారా లోకేష్ కలిసారు. ముగ్గురు నాయకులు కలిసి జైలు లోపలికి వెళ్లి చంద్రబాబును కలిసారు.దాదాపు 30 నిమిషాలపాటు చంద్రబాబుతో వీరు మాట్లాడారు. అనంతరం రాజమండ్రిలోనే వున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా కలిసి పరామర్శించారు.