Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో ఘోరం... ఆటోను ఢీకొట్టి నీటికాలువలోకి దూసుకెళ్లిన బిజెపి నేత కారు

కృష్ణా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామర్రు నియోజకవర్గ బిజెపి ఇంచార్జి కృష్ణబాబు కొండాయిపాలెం వద్ద రోడ్డుప్రమాదానికి గురయ్యారు. కృష్ణబాబు దంపతులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తాపడగా కారు నీటికాలువలో దూసుకెళ్లింది. కృష్ణబాబు దంపతులు వెంటనే కారులోంచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. కానీ ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.