Asianet News TeluguAsianet News Telugu

నూజివీడులో దారుణం... కూతురు వయసు బాలికతో చర్చి ఫాదర్ వికృత చేష్టలు

గన్నవరం : నిత్యం ఆ దేవుడు సన్నిధిలో వుంటూ పవిత్రంగా వుండాల్సిన చర్చి పాస్టర్ పాడుపని చేసాడు.

గన్నవరం : నిత్యం ఆ దేవుడు సన్నిధిలో వుంటూ పవిత్రంగా వుండాల్సిన చర్చి పాస్టర్ పాడుపని చేసాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆ దేవుడి కృప కోసం వచ్చిన కూతురి వయసు మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకుని చివరకు ఆమెను లేపుకుపోయాడు. ఈ దారుణం కృష్ణా జిల్లా గన్నవరంలో వెలుగుచూసింది.  

నూజివీడులో చర్చి ఫాదర్ గా పనిచేసే నాగేశ్వరరావు(45) భార్య ఇటీవలే క్యాన్సర్ తో మరణించింది. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలిక  అనారోగ్యంతో బాధపడగా తల్లిదండ్రులు చర్చికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పిన ఫాస్టర్ లోబర్చుకున్నాడు. కొన్నాళ్ళకు తల్లిదండ్రులకు విషయం తెలిసి బాలికను గన్నవరం మండలం ముస్తాబాద్ లోని పిన్ని ఇంటికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అక్కడినుండి బాలికను లేపుకుని హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. బాలిక బందువులు ఎలాగోలా హైదరాబాద్ లో వీరి ఆఛూకీ తెలుసుకుని ఫాస్టర్ ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించారు పోలీసులు. 

Video Top Stories